ఎంపీ సంతోష్ ప్రకృతి ప్రేమికుడు:పల్లా

1105
mlc palla rajeshwar reddy
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ ప్రకృతి ప్రేమికుడని తెలిపారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. కీసర గుట్టలో ఎకో ఫ్రెండ్లీ గ్రీనరి పార్క్‌కు సంతోష్ కుమార్ శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పల్లా ఎంపీ నిధులతో కీసర అడవిని అభివృద్ధి చేయడం గొప్ప విషయం అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంపీ సంతోష్ ముందున్నారని చెప్పారు. గత ప్రభుత్వాలు అడవులను ధ్వంసం చేశాయి.హరితహారం లాంటి కార్యక్రమం దేశంలో ఏ రాష్ట్రంలో లేదన్నారు.

కీసర అభయారణ్యం అభివృద్ధి కోసం ఎంపీ నిధుల నుంచి రూ. 3 కోట్లు ఇవ్వడం సంతోషకరమన్నారు మంత్రి మల్లారెడ్డి. 1550 ఎకరాలను దత్తత తీసుకొని పచ్చదనం పెంపొందించడం అభినందనీయమన్నారు. హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు.ప్రతి ఒక్కరూ 6 మొక్కల చొప్పున నాటి సంరక్షించాలన్నారు.

- Advertisement -