రైతును రాజు చేస్తాం: ఎమ్మెల్సీ పల్లా

291
mlc palla
- Advertisement -

రైతుల కోసం,రైతును రాజును చేయడం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు రైతు బంధు సమితి ఛైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. మహబూబాబాద్‌లో మాట్లాడిన ఆయన 2604 రైతు వేదికలను త్వరలో పూర్తి చేయబోతున్నాం అన్నారు.

24 గంటల్లో 54 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చి ప్రతిపక్షలా నోర్లు మూయించిన గొప్ప సీఎం కేసీఆర్ అన్నారు. ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన సీఎం కేసీఆర్ మాత్రం తన విమర్శలను పనుల రూపంలో చూపుతున్నారని తెలిపారు.

కేంద్ర జల శక్తి కూడా తెలంగాణ రాష్ట్రానికి పోయి మిషన్ భగీరథ చూసి రావాలని అన్ని రాష్ట్రాల సీఎం లకు,అధికారులకు సూచనలు చేసిందని…తెలంగాణ శాన్, నిషన్ ని సీఎం కేసీఆర్ తన పనుల ద్వారా దేశ ప్రజలకు చూపుతున్నారని వెల్లడించారు.

లాక్ డౌన్ లో కూడా రైతులు ఇబ్బంది పడవద్దని వారి పంటలను వారి గ్రామాల్లోనే కొన్న గొప్ప ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ది అన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని టెక్నాలజీ తో రైతు వేదికల నిర్మాణం త్వరలో పూర్తి అవుతుంది.గల్లీలో ఉన్న ఢిల్లీలో ఉన్న మారుమూల గ్రమాల్లో ఉన్న సామాన్య రైతుతో కూడా అధికారులు,ముఖ్యమంత్రి మాట్లాడవచ్చన్పారు. ప్రతిపక్షాలు 300 కేసులు వేసిన ఒక్కక్కటి పరిష్కరిస్తూ పనులు చేస్తున్న గొప్ప సీఎం కేసీఆర్..రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న రైతుల ప్రయోజనాలే ప్రధాన ఏజెండగా స్వీకరించి సీఎం కేసీఆర్ పనులు చేపడతారని చెప్పారు.

- Advertisement -