ఆనంద్ రెడ్డి కుటుంబానికి ఎమ్మెల్సీ కవిత పరామర్శ..

120
mlc kavitha
- Advertisement -

నిజామాబాద్ జిల్లా‌ టీఆర్ఎస్ ‌నాయకుడు కేశ్‌పల్లి (గడ్డం) ఆనంద్‌ రెడ్డి‌ కుటుంబాన్ని హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఆనంద్‌ రెడ్డి కొద్ది రోజుల ‌క్రితం గుండెపోటుతో ‌మరణించారు. ఆనంద్ రెడ్డి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, జాజిరెడ్డి గోవర్ధన్, రాజేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, అరికెల‌ నర్సా రెడ్డి, వారి కుటుంబ సభ్యులకు ‌ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

- Advertisement -