ఎంపీ సంతోష్‌కి రాఖీ కట్టిన ఎమ్మెల్సీ కవిత

61
- Advertisement -

రక్షాబంధన్ పండగను పురస్కరించుకొని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌కు రాఖీ కట్టారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆమెతో పాటు జోగినపల్లి సౌమ్య కూడా రాఖీ కట్టగా ఆఫోటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు కవిత. రాఖీ ప్రేమకు ప్రతిరూపం అన్నారు. ఈ సందర్భంగా అందరికి రాఖి పండగ శుభాకాంక్షలు తెలిపారు.

Also Read:ప్రేమానుబంధాల..రాఖి

అనురాగ బంధాల్ని, ప్రేమానురాగాల్ని బలోపేతం చేసే అపురూప పర్వదినం రాఖీ పౌర్ణమి. శ్రావణ మాసంలో వచ్చే శుభకర వేడుకల్లో, రక్షాబంధనం రమణీయం. నిండు పున్నమివేళ సిరివెన్నెల కురిసే శ్రావణ పూర్ణిమనాడు, ఈ బంధనంలో మమతల మధురిమలు వెల్లివిరుస్తాయి. సోదరులు క్షేమంగా ఉండాలని ఆక్షాంక్షిస్తూ ఆడపడుచులు రాఖీని కడుతారు.

- Advertisement -