- Advertisement -
తెలంగాణతో కాంగ్రెస్ కు ఎన్నికల బంధమే.. బీఆర్ఎస్ది పేగు బంధమన్నారు ఎమ్మెల్సీ కవిత.పేగుబంధాన్ని తెలంగాణ ప్రజలు కచ్చితంగా ఆదరిస్తారన్నారు.తెలంగాణను వెనుకబడేయడంలో ఆ పార్టీకి అనుబంధం ఉందదని కాంగ్రెస్పై మండిపడ్డారు.
హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలిపింది నెహ్రూ..1969 ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న వారిపై కాల్పులు జరిగింది ఇందిరా గాంధీ హాయంలో..1969లో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన వారిపై ఇందిరా గాంధీ కాల్పులు జరిపిస్తే 369 మంది అమరులయ్యారన్నారు.
తెలంగాణకు చెందిన ఉమ్మడి రాష్ట్ర సీఎం అంజయ్యను హైదరాబాద్ విమానాశ్రయంలో రాజీవ్ గాంధీ అవమానించి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని చెప్పిన కవిత..2009లో సోనియా గాంధీ తెలంగాణ ఇస్తున్నామని ప్రకటించి వెనక్కి వెళ్లి కారణంగా వందలాది మంది అమరులయ్యారని మండిపడ్డారు.
Also Read:రోజు నిమ్మరసం తాగుతున్నారా?
- Advertisement -