గవర్నర్ ప్రసంగంపై స్పందించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గవర్నర్ ప్రసంగంలో కొత్తదనమేమీ లేదు అని.. గాంధీ కుటుంబానికి కేవలం ఎన్నికల సమయంలోనే తెలంగాణ గుర్తొస్తుందా ? చెప్పాలన్నారు. మీ ప్రభుత్వం విఫలమవుతున్న నేపథ్యంలో గాంధీ కుటుంబం బాధ్యత తీసుకోవాలి అన్నారు.
గాంధీ కుటుంబం సంతకాలు చేసిన గ్యారెంటీలను చూసే ప్రజలు ఓట్లు వేశారు.. స్థానిక కాంగ్రెస్ నాయకులను చూసి ప్రజలు ఓట్లు వేయలేదు అన్నారు. బాధ్యత తీసుకొని గాంధీ కుటుంబం తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి అన్నారు.
గవర్నర్ ప్రసంగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు కవిత. ఎన్నికల సమయంలో గాంధీ కుటుంబం వచ్చి ఇచ్చిన హామీల అమలుపై ప్రస్తావనే లేదు.. అబద్దాలనే మళ్లీ అందమైన భాషలో చెప్పే ప్రయత్నం చేశారు అన్నారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఎండగడుతాం.. రూ. లక్షా 50 వేల కోట్ల అప్పులు చేసినా ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు అన్నారు. మహిళలకు నెలకు 2500 ఇస్తామన్న హామీని విస్మరించిందన్నారు.
Also Read:మంత్రి పదవి రేసులో ఉన్నా: మల్రెడ్డి