కవిత జ్యుడిషీయల్ కస్టడి పొడగింపు

24
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యూడిషీయల్ కస్టడీని పొడగించింది న్యాయస్థానం. ఈడీ కేసులో రిమాండ్ ముగియ‌డంతో క‌విత‌ను వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా తీహార్ జైలు నుండి హాజ‌రు ప‌రిచారు అధికారులు.

దర్యాప్తు కొన‌సాగుతున్నందున రిమాండ్ పొడిగించాల‌ని కోర్టును ఈడీ కోరింది. ఈడీ విజ్ఞ‌ప్తి మేర‌కు ఈ నెల 20వ తేదీ వ‌ర‌కు క‌స్ట‌డీ పొడిగిస్తూ కోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. 8 వేల పేజీల స‌ప్లిమెంట‌రీ ఛార్జిషీట్ దాఖ‌లు చేశామని… స‌ప్లిమెంట్ ఛార్జిషీట్ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునే అంశంపై ఈ నెల 20న కోర్టు విచార‌ణ చేప‌ట్ట‌నుంది.

Also Read:సిస్టర్ ఫ్రాన్సెస్కోగా టబు!

- Advertisement -