- Advertisement -
మాది రైతు ప్రభుత్వం.. మోదీది కార్పొరేట్ల ప్రభుత్వం అంటు మండిపడ్డారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తాజాగా అమె ఓ ప్రముఖ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. దేశానికి అందించే బియ్యంలో తెలంగాణ నుంచే 40 శాతం ఉన్నాయని కవిత తెలిపారు. ఈ క్రమంలో రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ నిలిచిందన్నారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఢిల్లీలో ధర్నాం చేశాం. కానీ కేంద్రం నుంచి స్పందన రాలేదన్నారు.
మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రైతులను మోదీ గాలికి వదిలేస్తే.. కేసీఆర్ మాత్రం రైతులకు అండగా ఉన్నారని తెలిపారు. ఈ క్రమంలో యాసంగింలో పండించిన వరి ధాన్యాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ నిన్న ప్రకటించిన విషయాన్ని కవిత పేర్కొన్నారు.
- Advertisement -