కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ధ్వజం..

37
- Advertisement -

రాష్ట్ర రైతులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సవతి తల్లి ప్రేమ మరోసారి బయటపడిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. యాసంగిలో తెలంగాణలో అధిక శాతం బాయిల్డ్‌ రైస్‌ ( ఉప్పుడు బియ్యం ) మాత్రమే ఉత్పత్తి అవుతుందని కేంద్ర ప్రభుత్వానికి, ఎఫ్‌సీఐకి తెలిసినా, రా రైస్ మాత్రమే కొంటామంటూ మొండి వైఖరిని ప్రదర్శిస్తోంది విమర్శించారు.

రైతులు పండించే పంటను కొనకుండా, పండని పంటను కొంటామంటూ ప్రకటించి బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. తెలంగాణ వ్యవసాయం గురించి ఏ మాత్రం అవగాహన లేని బండి సంజయ్ ,యాసంగిలో రాష్ట్రంలో ఏ రకం బియ్యం ఉత్పత్తి అవుతాయో తెలుసుకోండి అని హితవు పలికారు. మీకు తెలియకపోతే రాష్ట్రంలో ఏ రైతును అడిగినా మీకు జ్ఞానోదయం చేయిస్తారు. మీ అర్థ జ్ఞానంతో అన్నదాతలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు.

- Advertisement -