బాధిత కుటుంబాలకు ఆసరాగా ప్రభుత్వం- ఎమ్మెల్యే

158
mla kp
- Advertisement -

భారీవర్షాల కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని దత్తాత్రేయ నగర్‌లో వరద బాధిత కుటుంబాలకు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని జోనల్ కమిషనర్ మమత, స్థానిక డివిజన్ అధ్యక్షులు కెఎం గౌరీష్‌తో కలిసి ప్రభుత్వం ద్వారా రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వరద బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకునేందుకు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు తక్షణ సహాయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం రూ.550 కోట్లు కేటాయించడం సంతోషకరమని, వరదల వల్ల ఇళ్లలోకి నీరు రావడం, ఆస్తి నష్టం జరగడం, ఇల్లు కోల్పోయిన వారికి ఆర్థికంగా సహాయం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డిసి మంగతాయారు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -