బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి..

150
- Advertisement -

ఎంపీ ధర్మపురి అరవింద్ మా సీఎం కేబినెట్ మంత్రులపై వాడిన భాషను ఖండిస్తున్నాం.. పసుపు బోర్డు తెస్తానని పారిపోయిన అరవింద్‌కు వ్యవసాయం మీద మాట్లాడే అర్హత ఉందా..రైతులను హత్యలు చేస్తున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని ప్రభుత్వ చీఫ్ విప్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు తెస్తా అని రైతులను మోసం చేసిన చరిత్ర అరవింద్ ది. బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోని మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించం ఖబడ్దార్ అని హెచ్చరించారు.

- Advertisement -