రేవంత్…420: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్

23
trs
- Advertisement -

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో ఎంపీ బీబీ పాటిల్, కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీ ముజుబుద్దిన్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన సురేందర్ రెడ్డి… ఎల్లారెడ్డిలో మన ఊరు మన పోరు పేరు మీద కాంగ్రెస్ సభ చూస్తుంటే మాకు నవ్వు వస్తుందన్నారు. అక్కడ ఎల్లారెడ్డి ప్రజలే లేరు, ఎల్లారెడ్డికి సంబంధించిన ఒక్క నాయకుడు లేరన్నారు.

అంతా కిరాయికి తెచ్చుకున్న నాయకులు ఉన్నారని….రేవంత్ రెడ్డి ఒక్క బ్రోకర్ వి, 420 అని మండిపడ్డారు. ఇలాంటి 420 రావడం వలన కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ పోతుంది అని కాంగ్రెస్ నాయకులే అంటున్నారు….పిసిసి పదవిని కొనుక్కోన్న దొంగవి అని దుయ్యబట్టారు. తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పరిశ్రమలు మూతపడతటానికి కారణం కాంగ్రెస్ ….సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్‌కు లేదన్నారు.

సీఎం కేసీఆర్ నాయకత్వం కోసం దేశమే చూస్తుంది….ఈ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు, కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఎక్కడైనా ఉన్నాయా అని రేవంత్ రెడ్డి అడుగుతున్న అన్నారు. రేవంత్ రెడ్డిని ప్రజలు పిచ్చికుక్కగా చూస్తున్నారు….వరి వేసి ఇబ్బంది పడద్దు అని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు చెప్పారన్నారు.

- Advertisement -