మొక్కలు నాటిన సుధీర్ రెడ్డి..

36
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపుమేరకు తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటారు LB Nagar నియోజకవర్గ శాసనభ్యులు ,మూసీ రివర్ డెవలప్‌మెంట్ ఫ్రంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి.

ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ…ముఖ్యమంత్రి కేసీఆర్ హరిత తెలంగాణ స్వప్నం సాకారం దిశగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.

గ్రీన్ఇండియా చాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ అభినందనీయులు. దీని ద్వారా తెలంగాణ పచ్చని తెలంగాణ దిశగా ముందుకు వెళుతుంది.తెలంగాణ దేశానికే మార్గదర్శిగా నిలుస్తుంది….హరితహరం స్పూర్తితో కొనసాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది అన్నారు.

తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి గ్రీన్ ఇండియా చాలెంజ్ లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక దాన్యవాదాలు తెలియజేశారు.

- Advertisement -