సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు..

68
- Advertisement -

తెలంగాణలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అద్బుతంగా నిర్మాణం చేస్తున్నారని సినీ నటి, ఏపీ నగరి ఎమ్మెల్యే రోజా తెలిపారు. ఈరోజు ఎమ్మెల్యే రోజ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్ అద్భుతంగా నిర్మాణం చేయిస్తున్నారని అన్నారు.

ఈ కాలంలో ఎవరికీ దక్కని గొప్ప అవకాశం కేసీఆర్ కు మాత్రమే దక్కిందని అన్నారు. గతంలో పోలిస్తే ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందని చెప్పారు. ఆలయ నిర్మాణానికి వాడిన గ్రానైట్ ను గుంటూరు నుంచి తెచ్చారని తెలిపారు. కేసీఆర్ కారణజన్ముడని, భగవంతుడే కేసీఆర్ ద్వారా తనకు కావాల్సిన ఆలయాన్ని నిర్మించుకున్నాడని చెప్పారు. లక్ష్మీ నరసింహస్వామి అంటే చాలా పవర్ ఫుల్ అని… ఆయనకు ఇంత పెద్ద గుడి కట్టాలంటే ఆయన ఆశీస్సులు ఉండాలని అన్నారు. దేవుడి సహకారంతో ఆలయాన్ని కేసీఆర్ నిర్మించారని చెప్పారు. ఎప్పటికీ తెలుగువారు అన్నదముళ్ళు, అక్కచెల్లెలుగా కలిసి ఉండాలని రోజా ఆకాంక్షించారు.

- Advertisement -