మొక్క మానవాళికి జీవనాధారంః ఎమ్మెల్యే రోజా

377
roja
- Advertisement -

మొక్క మానవాళికి జీవనాధారం అన్నారు నగరి ఎమ్మెల్యే , నటి రోజా. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా నగరి నియోజకవర్గ పరిధిలోని పుత్తూరులోని SRS గవర్నమెంట్ హైస్కూల్ లో మొక్కలు నాటారు. ఈసందర్భంగా రోజా మాట్లాడుతూ… ప్రతీ ఇంటికి ఐదు మొక్కలు నాటుదాం.. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా మార్చుదాం అన్నారు.

రాష్ట్రం వ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటడమే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం అన్నారు. హరితాంధ్రప్రదేశ్ లో ప్రతీ ఒక్కరం భాగస్వామ్యం అయ్యి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మరో ముగ్గురికి సవాల్ విసుతున్నట్లు తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, యాంకర్ రేష్మీగౌతం లకు మొక్కలు నాటాల్సిందిగా సవాల్ విసిరారు.

- Advertisement -