పవన్‌కి పక్కలేశావా..నిన్నే……!

252
mla roja bandla ganesh verbal war
- Advertisement -

ప్రముఖ సినీ నటి రోజా, నిర్మాత బండ్ల గణేష్ మధ్య పవన్ కళ్యాణ్ అంశంపై మాటల యుద్ధం జరిగింది. ఇటీవల జగన్‌పై పవన్‌ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. దీనికి రోజా ఘాటుగా కౌంటరిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ టీవీ షోలో జరిగిన కార్యక్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి  నీ పళ్లు రాలగొడతా అంటే నీ పళ్లు రాలగొడతా అంటూ ఇద్దరూ ఒకరిపై తీవ్రస్ధాయిలో దుమ్మెత్తి పోసుకున్నారు.

షో సందర్భంగా ఫోన్‌ లైన్లో వచ్చిన రోజా…చిరంజీవి వారసత్వంతో, ఆయన చరిష్మాను ఉపయోగించుకుని ఆయన తమ్ముళ్లు, కొడుకు, మేనల్లుళ్లు ఇండస్ట్రీలోకి వచ్చారని, వారు చిరంజీవి కుటుంబ సభ్యులు కాకుంటే వారికి అవకాశాలు ఎవరిస్తారు? వాళ్లకు టాలెంట్ ఉందా? లేదా? అనే విషయం తర్వాత తెలుస్తుంది అని రోజా అన్నారు. ఈ క్రమంలో రోజా మాట్లాడే తీరుతో ఇదే చర్చలో పాల్గొన్న బండ్ల గణేష్ హర్ట్ అయ్యారు.

 mla roja bandla ganesh verbal war
అవునవును. పాయింట్ మాట్లాడటం రాకే మేము ఎమ్మెల్యేలు కాలేదు. మీకు పాయింట్ మాట్లాడటం వచ్చింది కాబట్టే ఎమ్మెల్యేలు అయ్యారు. రెండు సార్లు ఓడిపోయారు.. ఒకసారి అయ్యారు… మీది గోల్డెన్ లెగ్! దేశం మొత్తం కోడై కూస్తోంది. గోల్డెన్ లెగ్ ఎప్పుడూ వైఎస్ జగన్‌గారితో ఉండి, ఆయన్ని ముఖ్యమంత్రిని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజశేఖర్ రెడ్డిగారిని‌ పైకి పంపించేశారు, గొప్ప నాయకురాలివి, మహాతల్లివి..ఘాటుగా స్పందించాడు బండ్ల.

ఈ క్రమంలో స్పందించిన రోజా పవన్‌కు పక్కలేసావా అనగా బండ్ల సైతం నువ్వు రా …..పెడతా అంటూ నోరుజారేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

https://youtu.be/QWd4-jxsuC4

- Advertisement -