మొక్కలు నాటిన ఎమ్మెల్యే రేగా కాంతారావు..

170
mla
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతు రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతు ముందుకు కొనసాగుతుంది. ఈ ఛాలెంజ్‌ భాగాంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు మొక్కలు నాటారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని తన స్వగ్రామమైన సమత్ భట్టుపల్లి గ్రామంలో ఎంపీ, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 3వ విడత ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి సుమారు 100 మొక్కలు నాటారు ఎమ్మెల్యే రేగా కాంతారావు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ రోజు మొక్కలు నాటడం సంతోషంగా ఉంది.ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణలో హరిత హరం కార్యక్రమం చేపట్టడం వల్ల ప్రతి గ్రామంలో మరియు పట్టణాల్లో పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ స్పూర్తిగా తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని మరియు ఇంత అద్భుతమైన కార్యక్రమన్ని ముందుకు తీసుకొచ్చిన ఎంపీ సంతోష్ కుమార్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -