మొక్కలు నాటిన ఎమ్మెల్యే రేగా కాంతారావు..

150
MLA Rega Kantha Rao
- Advertisement -

ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యులు ఎంపీ, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ రోజు మొక్కలు నాటడం సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో హరితహారం కార్యక్రమం చేపట్టడం వల్ల ప్రతి గ్రామంలో మరియు పట్టణాల్లో పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ స్పూర్తిగా తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని మరియు ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చిన ఎంపీ సంతోష్ కుమార్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -