మొక్కలు నాటిన ఎమ్మెల్యే రేగా కాంతారావు..

261
MLA Rega Kantha Rao
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈ రోజు తన పుట్టిన రోజును పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మొక్కలు నాటడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందని.. ఈ పర్యావరణ పరిరక్షణకు ఒక నిజమైన ఛాలెంజ్ ఎందుకంటే ఆక్సిజన్ కేంద్రాలు నెలకొల్పే పరిస్థితి మనకు వచ్చింది అంటే మనం మొక్కలు నాటడం పెంచడం బాధ్యతగా తీసుకోవాలి. మొక్కలు నాటిన వాటిని పరిరక్షించుకునే బాధ్యత గుర్తు చేస్తూ ఇంత గొప్ప ఛాలెంజ్‌ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి అభినందనలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

- Advertisement -