- Advertisement -
ప్రజలకిచ్చిన హామీని సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరస్ధాయిగా నిలిచిపోయారని ఎమ్మెల్యే రెడ్యా నాయక్ తెలిపారు. మహబుబాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన మరిపెడ నిండు సభలో ఇచ్చిన హామీని నిలుపుకుని,ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ తీర్చారని చెప్పారు.
కాళేశ్వరం చిట్టచివరి ఆయకట్టు డోర్నకల్ నియోజకవర్గంలోని చెరువులకు గోదావరి జలాలు చేరడంతో ఇక్కడి ప్రజలు సంతోషంతో ఉన్నారని చెప్పారు. ఏళ్ల తరబడి ఎండిన చెరువులు కాళేశ్వరం జలాలతో మత్తలు పోస్తుండడంతో రైతన్నల మోములో చిరునవ్వు కనిపిస్తుందన్నారు. డోర్నకల్ నియోజకవర్గ ప్రజల తరపున సీఎం కేసీఆర్కి ధన్యవాదాలు చెబుతున్నానని చెప్పారు.
- Advertisement -