దొడ్డి కొమురయ్యకు ఘన నివాళి

253
doddi komuraiah
- Advertisement -

తెలంగాణ సాయుధ పోరాట, రైతాంగ యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి ని నల్గొండ లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, నోముల నరసిమయ్య నల్గొండ లోని ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన దొడ్డి కొమురయ్య ఆశయాలను ముందుకు తీసుకుపోతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సూపరిపాలన అందిస్తున్నారని mla లు భూపాల్ రెడ్డి అన్నారు. రైతుల కష్టాలను దూరం చేసేందుకు కొమురయ్య పోరాటం చేసారని ,నేడు తెలంగాణ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో రైతు రాజుగా మారారని అన్నారు..

ఈ కార్యక్రమంలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, వైస్ ఛైర్మన్ రమేష్ గౌడ్, trs రాష్ట్ర నాయకులు పంకజ్ యాదవ్, కౌన్సిలర్ లు, నాయకులు … యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు…

- Advertisement -