మొక్కలు నాటిన ఎమ్మెల్యే మహేష్ రెడ్డి..

227
MLA Koppula Mahesh Reddy
- Advertisement -

రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజు తన జన్మదిన సందర్బంగా ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పరిగి నియోజకవర్గంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ రోజు మొక్కలు నాటడం సంతోషంగా ఉంది. సీఎం కెసిఆర్ తెలంగాణలో హరిత హరం కార్యక్రమం చేపట్టడం వల్ల ప్రతి గ్రామంలో మరియు పట్టణాల్లో పచ్చదనంతో కళకళ లాడు తున్నాయన్నారు.ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఈ క్రమంలో పల్లెలకు ప్రాధాన్యానికి హరితహారం ఇప్పటి వరకు 211 కోట్లు మొక్కలు నాటి సరికొత్త రికార్డు నెలకొల్పారు.

4 శాతం పెరిగిన పచ్చదనం 42,803 హెక్టార్లలో బ్లాక్‌ ప్లాంటేషన్‌ మూడున్నర లక్షల హెక్టార్లలో అడవుల పునర్జీవం 230 కోట్ల మొక్కల లక్ష్యం దిశగా పరుగులు వేస్తుంది దీనికి తోడుగా ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం స్థాపించి తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తంలో ప్రముఖులు సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు అని తేడాలేకుండా అందరూ అద్భుతంగా గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొనేలా చేసి ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తన్న సంతోష్ కుమార్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -