రేవంత్…చంద్రబాబు పెంచిన లిల్లీపుట్: జీవన్ రెడ్డి

151
mla
- Advertisement -

చంద్రబాబు పెంచిన లిల్లీ పుట్ రేవంత్ రెడ్డి అన్నారు పీయూసీ చైర్మన్ ,ఎమ్మెల్యే ఏ .జీవన్ రెడ్డి. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి..రేవంత్‌కు రాబిస్ వ్యాధి సోకిందన్నారు. మోడీ ని కెసిఆర్ కలవడం మీద రేవంత్ అడ్డమైన రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఫెడరల్ స్ఫూర్తి గురించి రాజ్యాంగం లో 263 ఆర్టికల్ స్పష్టం గా చెబుతోంది…..రాజకీయ పరిపక్వత లేని రేవంత్ కు రాష్ట్ర ప్రయోజనాల గురించి కెసిఆర్ మోడీ ని కలిస్తే మంచి కనిపిస్తుందా ?అని ప్రశ్నించారు.

పన్నెండు అంశాల పై కెసిఆర్ మోడీ కి వినతి పత్రాలు ఇచ్చారు…..యూపీ ఎంఐఎం సీట్ల గురించి వారిద్దరూ మాట్లాడుకుంటారా ? …పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ ఈ నెల పదకొండునే పీఎం మోడీ ని కలిశారు …కాంగ్రెస్ టిక్కెట్ల గురించి ఆయన మోడీ తో చర్చించారా ? అని ఎద్దేవా చేశారు. చైనా రాయబారి ని రాహుల్ గాంధీ చాలా సార్లు కలిశారు …దేశ ద్రోహానికి పాల్పడ్డారా ? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సీతక్క ను చంద్రబాబు దగ్గరకు రేవంత్ పంపారు ..కాంగ్రెస్ టిక్కెట్లు నిర్ణయించడానికి పంపారా ? అన్నారు. మమత బెనర్జీ… మోడీ తో భీకరంగా పోరాడారు ..ఆమె మోడీ ని కలవలేదా ?……రేవంత్ గోబెల్స్ ను మించి పోయారన్నారు.

గాంధీ భవన్ ను గాసిప్స్ అడ్డా గా మార్చాడు…సోషల్ మీడియాలో తన చెంచాల ద్వారా అబద్దాలు ప్రచారం చేయిస్తున్నారన్నారు. రేవంత్ సినిమా ల్లో ఐటెం సాంగ్ లాంటోడు…..మేము సోషల్ ఇంజనీరింగ్ చేస్తుంటే …రేవంత్ సోషల్ మీడియా ఇంజనీరింగ్ చేస్తున్నారన్నారు. ఎంఐఎం మతతత్వం గురించి మాట్లాడుతున్నావ్ ..కేరళలో ముస్లిం లీగ్ కాంగ్రెస్ మిత్రపక్షం అది మతతత్వ పార్టీ కాదా ? అని ప్రశ్నించారు. శివసేన మతతత్వ పార్టీ కాదా ?ఆ పార్టీ తో కాంగ్రెస్ ఎందుకు అధికారాన్ని పంచుకుంటోంది ?…ఎన్టీఆర్.. ఇందిరాగాంధీ ని ,రాజీవ్ గాంధీ కలవలేదా ? అన్నారు.

నోరు అదుపులో పెట్టుకోకపోతే రేవంత్ కు రాజకీయంగా పుట్టగతులుండవన్నారు. ఎంపీ తేజస్వీ సూర్య మా సీఎం ను తిట్టినా మా మంత్రి కె టీ ఆర్ ఆయనకు జ్ఞాపిక ఇచ్చారు ..ఇదే సంస్కారం అన్నారు. శరద్ పవార్, రాహుల్ ,సోనియా లను కలిసిన తర్వాత మోడీ ని కలుస్తారు ..ఆ తర్వాత మోడీ ని కలుస్తారు …పవార్ కూడా తప్పు చేస్తున్నారా ?…..చిల్లర రాజకీయాలు రేవంత్ మానుకోవాలని హితవు పలికారు.

- Advertisement -