ఎంపీ అరవింద్..చీటర్: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

123
jeevan
- Advertisement -

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా పాయింట్‌లో మాట్లాడిన జీవన్ రెడ్డి…. సీఎం కేసీఆర్ కుటుంబాన్ని తిట్టినవాళ్లెవరూ బాగుపడలేదన్నారు. కేటీఆర్‌పై అరవింద్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు.

అరవింద్ ఒక జోకర్.. చీటర్ అంటూ నిప్పులు చెరిగారు . బీజేపీ అంటే మొన్నటి వరకు బడా ఝూటా పార్టీ అని పేరుండేది.. బండి సంజయ్.. గుండు అరవింద్‌లతో జోకర్ల పార్టీగా ముద్రపడిందన్నారు. రైల్వేలను అమ్ముతున్నారు. బీఎస్ఎన్ ఎల్ ను అమ్ముతున్నారు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్ముతానన్నారు.. రేపు బీహెచ్ఈఎల్ తోపాటు.. సింగరేణిని కడా అమ్మడానికి ప్రయత్నం చేస్తారని మండిపడ్డారు.

హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టును కూడా అమ్ముతున్నారు.. వీళ్లు ఎట్లా తయారయ్యారంటే.. బీజేపీ అంటేనే అమ్మకాల పార్టీ అయిపోయిందన్నారు. బీజేపీ వాళ్లు ఏం చేస్తున్నారంటే.. ఏం లేదు యాడేడ ఏమున్నాయో అన్నీ అమ్ముకుని తింటాం అనేలా తయారైందని విమర్శించారు. ఒక వైపు ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్ముతూ ఇక్కడకొచ్చి ఉద్యోగాలు ఇవ్వాలి అని అడుగుతారా..? అని ఆయన ప్రశ్నించారు. అరవింద్‌ను మెట్ పల్లి నుంచి నిజామాబాద్ దాకా జనం వెంటపడి కొడతారని జీవన్ రెడ్డి హెచ్చరించారు.

- Advertisement -