అమర జవాన్లకు ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి నివాళి..

252
MLA Janardhan Reddy
- Advertisement -

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో టీఆరెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత్ – చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో అమరుడైన తెలంగాణ ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు మరియు ఇతర వీర జవాన్లకు ఘననివాళిగా జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి అంబేద్కర్ కూడలిలోని విగ్రహం వరకు భారి కాగడల ర్యాలీ నిర్వహించి అమర జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి,ఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన వీర జవాన్లను ఈ దేశం ఎప్పటికి మరిచిపోదు అన్నారు, దేశ సరిహద్దు ప్రాంతాల్లో జవాన్లు నిరంతరం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రక్షణ కల్పిస్తూ ఉండటం వల్లె ప్రజలమంతా సంతోషంగా ఉండగలుగుతున్నామని అన్నారు. గుండెనిండా దేశభక్తిని నింపుకొని అహర్నిశలు దేశం కోసం పనిచేస్తున్న సైనికులు సేవలు మారువలేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారి సంఖ్యలో టిఆర్ఎస్ శ్రేణులు,యువకులు,దేశ భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -