ఎమ్మెల్యే హరీశ్ బాబు…సత్యాగ్రహ దీక్ష

7
- Advertisement -

ఎమ్మెల్యే హరీశ్ బాబు సత్యాగ్రహ దీక్ష 5వ రోజుకు చేరింది. ఎమ్మెల్యే హరీశ్ బాబు-ఫారెస్ట్ అధికారుల మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌(టి) నియోజకవర్గంలో పోడు భూముల సమస్య పరిష్కారం కోసం గురువారం జరిగిన చర్చలు విఫలం అయ్యాయి.

జీవో నం.49 రద్దు చేసి, పోడు భూములను సాగు హక్కుగా గుర్తించాలని డిమాండ్ చేశారు హరీశ్‌ బాబు. రైతుల పక్షాన నిలబడి, రైతుల డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.

దీక్ష కారణంగా ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరీక్షిస్తోంది వైద్యుల బృందం.

Also Read:అనాస…ఉపయోగాలు తెలుసా?

 

- Advertisement -