అన్ని పార్టీల సమన్వయంతో సాధించుకున్నాం- ఎమ్మెల్యే

50
- Advertisement -

గుంటూరు జిల్లా నరసరావుపేట..ఇటీవల ఏపీ జిల్లా విస్తరణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలోని నరసరావుపేటను ప్రత్యేక జిల్లాగా ప్రకటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఆంశం నరసరావుపేటను జిల్లాగా చేయడం అని అన్నారు.

ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. నరసరావుపేట ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నా కృతజ్ఞతలు..ఈ ప్రాంతం నుండి ఎంతో మంది మహానుభావులందరికి స్థానం కల్పించింది. నరసరావుపేట ప్రాంతం ప్రజలు ఎంతో సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో జిల్లా స్థాయి సంస్థల,ప్రభుత్వ స్థలాలు,అధికారిక నివాసాలకు అవసరం అయిన స్థలాలు ఇక్కడ ఉన్నాయి. ముఖ్యమంత్రికి నాతో ఉన్న సన్నిహిత బంధం వల్ల అనేక సార్లు నరసరావుపేటను జిల్లాగా ప్రకటించాలి అని కొరాను.

అన్ని పార్టీల మధ్య సమన్వయంతో నరసరావుపేట జిల్లాగా సాధించుకున్నము. ఈ అంశం మాత్రం చరిత్రలో నిలిచి పోయే అంశం.. జిల్లా ప్రకటించిన సందర్భంగా నరసరావుపేట నుండి కోటప్పకొండకు ముఖ్యమంత్రి సంగిభావ పాదయాత్ర చేస్తున్నాము. ఈ యాత్రలో అందరూ పాల్గొని జయప్రదం చెయ్యాలి అని కోరుతున్నాను.. రేపు 9 గంటలకు ఈ పాదయాత్ర ప్రారంభం అవుతుందని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

- Advertisement -