మొక్కలు నాటిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

50
- Advertisement -

బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ జోరుగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మొక్కలు నాటారు. తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇంత గొప్ప కార్యక్రమంలో అవకాశం కల్పించిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ హరితహారంలో పాల్గొనాలని హరితభారతావనని నిర్మించాలని కోరారు. ప్రకృతి పర్యావరణానికి మనం తోడు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి దుర్గం జయతార పాల్గొన్నారు.

Also Read: మొక్కలు నాటిన సహజ ల్యాండ్స్‌ ఎండీ

- Advertisement -