కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

393
dasyamvibayvhaskar
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపడుకుంటామని చెప్పారు ప్రభత్వ ఛీప్ విప్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్. హన్మకొండలో వరంగల్ పశ్చిమ నియోజక వర్గ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్ , కార్పోరేటర్లు, పలువురు ముఖ్య కార్యకర్తలు పాల్గోన్నారు. అలాగే ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు టీఆర్ఎస్ లో చేరారు.

ఈసందర్భంగా ప్రభుత్వ ఛీప్ విప్ మాట్లాడుతూ.. కార్యకర్తల పనితీరుతోనే వరంగల్ పశ్చిమ నియోజక వర్గానికి మంచి పేరు వచ్చింది. కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా పార్టీ ఆదుకుంటుంది. అందరికి లాభం చేకూర్చే విదంగా నేను పని చేస్తానని చెప్పారు. ఈనెల 11వ తేది నుంచి డివిజన్ స్ధాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కచ్చూలూరు బోటు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు త్వరలో ఇన్సూరెన్స్ చెక్కులను పంపిణీ చేస్తాంమని చెప్పారు.

- Advertisement -