శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి..

101
ttd
- Advertisement -

తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, పుదుచ్చేరి హోంమంత్రి నమాశ్శివాయం,మంత్రి ఆర్ముగం లు ఈ రోజు ఉదయం వి ఐ పి విరమసమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు,దర్శనానంతరం ఆలయ రంగనాకుల మండపంలో వీరికి వేదపండితులు ఆశీర్వచనం అందిచగా, ఆలయ అధికారులు పట్టువస్త్రాల తో సత్కయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం తెలంగాణ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

నిన్న ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదిన సందర్భంగా మంగళవారం హరితహారం కార్యక్రమంలో పాల్గొని,వెంటనే తిరుమల వెంకన్న ఆశీస్సుల కోసం వచ్చనని తెలిపారు.సంతోష్ కుమార్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆదేవదేవుణ్ణి ప్రార్దించినాన్నరు.ఆయన చేపట్టిన గ్రీన్ చాలెంజ్ కార్యక్రమం ఎంతో విజయవంతంగా కొనసాగుతోందని,దేశంలోనే ఎందరికో ఆదర్శప్రాయంగా ఈ కార్యక్రమం నిలుస్తోందన్నారు.భారత ప్రధాని మోది గారి చేతుల మీదుగా సంతోష్ గారు అవార్డు అందుకోవడం తెలంగాణ రాష్ట్ర నికే గర్వకారణమని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు.

- Advertisement -