ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..

708
trs mla suman
- Advertisement -

సోమవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పర్యటించారు. పర్యటనలో భాగంగా మండలంలోని బబ్బర్‌చెల్క వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సుమన్‌ ప్రారంభించారు. వరి ధాన్యం తీసుకువచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని మార్కెట్‌ కమిటీ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

suman

 

 

అనంతరం కొల్లూరు, రామ్‌పూర్‌ గ్రామాల్లో వైకుంఠ ధామం, డంపింగ్‌ యార్డుల నిర్మాణానికి బాల్క సుమన్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జడ్.పి చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి గారు,నియోజకవర్గ MPPలు, ZPTCలు,MPTCలు,సర్పంచ్‌లు,TRS పార్టీ నాయకులు,కార్యకర్తలు మరియు మీడియా మిత్రులు పాల్గొన్నారు.

mla suman

mla balka suman

 

MLA Balka Suman Laid foundation for the construction of Vaikunta Dhamam Crematorium & Dumping Yard at Rampur Village of Kotapally Mandal..

- Advertisement -