టీమిండియా పై మిథాలి సంచలన వ్యాఖ్యలు..

188
Mithali Raj Sensational Comments on Indian Cricket,
- Advertisement -

భారత క్రికెట్‌పై మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. టీమిండియాలో చాలా రాజకీయాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. క్రికెట్ లో ప్రతిభ ఉంటే చాలా అవకాశాలు వస్తాయని పలువురు చెబుతుంటారు.

కానీ..అది వాస్తవం కాదని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ చేసింది. ఆమె ఓ ప్రైవేట్ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ సంచలన విషయాలను బహిర్గతం చేసింది.

  Mithali Raj Sensational Comments on Indian Cricket,

ఐపీఎల్ వచ్చిన తరువాత వర్థమాన క్రికెటర్లకు అవకాశాలు పెరిగాయని, ప్రతిభ ఉంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయని సీనియర్లు, కోచ్ లు హితబోధ చేస్తారన్న సంగతి తెలిసిందే. అయితే క్రికెట్ లో రాణించాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదని తెలిపింది. టీమిండియాలో చాలా పాలిటిక్స్ ఉంటాయని తెలిపింది.మహిళా క్రికెట్ లో కూడా ఉన్నాయని చెప్పింది. కేవలం క్రికెట్ అని మాత్రమే కాదని, ప్రతి రంగంలోనూ రాజకీయాలు ఉన్నాయని తెలిపింది.

టీమిండియా ఆటగాళ్లతో హీరోయిన్లు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేలా తమతో ఎవరూ తిరగరని తెలిపింది. తనవరకు అలాంటి అనుభవాలు లేవని చెప్పింది. మూడు సార్లు ప్రేమలో విఫలమయ్యానని మిథాలీరాజ్ వెల్లడించింది. తనను విజయవంతమైన ఇండిపెండెంట్ మహిళగా కాబోయే భర్త గుర్తించాల్సి ఉంటుందని తెలిపింది.

- Advertisement -