మిర్యాలగూడ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్…

173
bhasker rao
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40 వేలకు చేరువైంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు.

కరోనా జలుబు, దగ్గు లక్షణాలతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో ప్రస్తుతం ఆయన మిర్యాలగూడలో హోం క్వారంటైన్‌ లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ రాగా వారు కొలుకోని డిశ్చార్జ్ అయ్యారు.

రాష్ట్రంలో బుధవారం తాజాగా 1,597 కరోనా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌ మహా నగరపాలక సంస్థ పరిధిలో 796 కేసులు నమోదు కాగా, ఇప్పటివరకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39,342కు చేరింది.

- Advertisement -