- Advertisement -
వైద్య,ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రి హరీశ్ రావు…పలు సంస్కరణలతో ప్రజల మన్ననలు పొందుతున్నారు. ముఖ్యంగా ఆస్పత్రికి వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు చేపడుతున్న హరీష్…పలు ఆస్పత్రులను తనిఖీ చేస్తూ రోగుల నుండి ఫీడ్ బ్యాక్ తెలుసుకుంటున్నారు.
ఇందులో భాగంగా కొండాపూర్ ఏరియా ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఈ క్రమంలో కొంత మంది డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం డాక్టర్ మూర్తి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు చేయగా అక్కడికక్కడే విచారణ చేపట్టి.. డాక్టర్ ను సస్పెండ్ చేశారు.
- Advertisement -