గొంగిడి దంపతులను పరామర్శించిన కేటీఆర్..

242
ktr
- Advertisement -

కరోనా బారీన పడ్డ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా, ఆమె భర్త నల్గొండ డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్‌ రెడ్డి ఆరోగ్య పరిస్ధితిని ఆరా తీశారు మంత్రి కేటీఆర్‌. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంగళవారం ఫోన్ ద్వారా పరామర్శించారు కేటీఆర్. వారి ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్న కేటీఆర్…వారికి ధైర్యం చెప్పారు.

మంత్రి కేటీఆర్‌తో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ , ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ,విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి వేర్వేరుగా ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

- Advertisement -