మరింతగా భద్రకాళి బండ్‌ను తీర్చిదిద్దాలి- మంత్రులు

67
- Advertisement -

ఆదివారం వరంగల్‌లోని భద్రకాళి బండ్‌ను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వి. శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. వారితో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు బండ్‌పై నడుస్తూ పరిశీలించారు. సందర్శకులతో మాట్లాడారు. బండ్ ఎలా ఉంది? ఇంకా ఏమైనా మార్పులు, చేర్పులు చేయాలా? ఎలాంటి ఏర్పాట్లు కోరుకుంటున్నారు? వంటి ప్రశ్నలు వేసి, అరా తీశారు. తగు విధంగా అధికారులకు సూచనలు చేశారు. మరింతగా భద్రకాళి బండ్‌ను తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు సూచనలు చేశారు.

- Advertisement -