పల్లె ప్రగతిలో పాల్గొన్న మంత్రులు..

67
- Advertisement -

5వ విడత పల్లె ప్రగతి భాగంగా బుధవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మాన్సాన్ గ్రామంలో మంత్రులు సబితాఇంద్రా రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులు పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

మంత్రులు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని తెలంగాణ గ్రామాలు నేడు పల్లె ప్రగతితో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ప్రతి ఊరిలో సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరించి, సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములై, తమ తమ గ్రామాలను తీర్చిదిద్దుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ జి రంజిత రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు, ప్రత్యేకించి మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -