రైతు వేదికలను ప్రారంభించిన మంత్రులు..

121
Ministers Niranjan Reddy
- Advertisement -

ఈరోజు మంత్రి గంగుల కమలాకర్‌ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి (మం) బద్దిపల్లి, గంగాధర (మం) కురిక్యాల, రామడుగు (మం) వెదిర గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలను సహచర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో బద్దిపల్లిలో నూతన వ్యవసాయ మార్కెట్ ఎర్పాటుకు, నూతన గోదాముల నిర్మాణానికి, కేంద్ర సహకార బ్యాంక్ ఎర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ZP చైర్ పర్సన్ కనుమల్ల విజయ, MLC నరదాసు లక్ష్మణ్ రావు గారు, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గారు, జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -