తెలంగాణ వేగంగా అభివృద్ది చెందుతుందిః ఈటెల

296
patancheru
- Advertisement -

దేశంలోనే అత్యధిక వేగంగా అభివృద్ది చెందుతన్న ఎకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజెందర్. సంగారెడ్డి జిల్లాలో పటాన్ చెరు నియోజకవర్గంలోని సుల్లాన్ పూర్ లో ఎస్ఎంటీ (సహజానంద మెడికల్ టెక్నాలజీస్) మెడికల్ డివైజ్ పార్క్ కు భూమి పూజ చేశారు మంత్రులు ఈటెల, మల్లారెడ్డి. ఈకార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పటసా్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జయెష్ రంజన్, సంస్థ యాజమాన్యం, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. 20 ఎకరాల్లో 250 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ..దేశంలో తెలంగాణ పెట్టుబడులకు కేంద్రంగా మారిందనీ, వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు 24గంటలు కరెంట్ ఇస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. పరిశ్రమల కోసం కుడా నీటి కేటాయింపు చేసుకున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని చెప్పారు. స్థానికులకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పించాలని యాజామాన్యాన్ని కోరారు.

- Advertisement -