పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుందాం: మంత్రి ప్రశాంత్ రెడ్డి

429
prashanth reddy
- Advertisement -

పరిసరాల పరిశుభ్రత పై ప్రతి ఆదివారం పది నిమిషాలు అంటూ మున్సిపల్‌శాఖ మంత్రి కేటిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు.ఆదివారం ఉదయం 10 గంటలకు మంత్రుల నివాస సముదాయంలోని తన అధికారిక నివాసంలో సతీమణి నీరజారెడ్డి తో కలిసి పరిసరాల పరిశుభ్రం చేశారు.ఇంటి ఆవరణలో నిల్వ ఉన్న నీటిని తొలగించారు.

ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ…మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ ఇచ్చిన పిలుపుతో ప్రజల్లో పరిసరాల పరిశుభ్రతపై మరింత అవగాహన పెరుగుతుందన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధుల ను నివారించవచ్చన్నారు. మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల సీజనల్ వ్యాధులు దరిచేరవని అన్నారు.

- Advertisement -