- Advertisement -
విధులకు ఆలస్యంగా హాజరైన ఉద్యోగులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పరిధిలోని శాఖలు మరియు కార్పోరేషన్ల ఉద్యోగుల హాజరుపై తుమ్మల సమీక్ష నిర్వహించారు.
ఉదయం 10:40 గంటల వరకు కూడా విధులకు హాజరుకాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులంతా ఉదయం 10:30 లోపే రిపోర్ట్ చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
హాజరుకాని ఉద్యోగుల నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుంచి విధులకు ఆలస్యంగా హాజరయ్యే ఉద్యోగులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలలన్నారు తుమ్మల.
Also Read:వినాయక చవితికి డిప్యూటీ సీఎం దూరం
- Advertisement -

