డాక్టర్లపై దాడులు చేస్తే కఠిన చర్యలు: తలసాని

218
talasani
- Advertisement -

డ్యూటి డాక్టర్లపై దాడులు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిని సందర్శించిన తలసాని…నిన్న జరిగిన ఘటనపై ఆరా తీశారు. డాక్టర్లతో మాట్లాడి గొడవ జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా మాట్లాడిన తలసాని..గాంధీ ఆస్పత్రి వైద్యులపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. గాంధీలో ప్రత్యేక పికెట్ ఏర్పాటుచేశామన్నారు. కరోనాను అరికట్టేందుకు లాక్ డౌన్‌ను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారందరిని దాదాపు గుర్తించినట్లు చెప్పారు. ఇంకా ఎవరైనా ఉంటే ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని మంత్రి పేర్కొన్నారు.

ప్రజలు ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించిన తలసాని…. గాంధీ ఆస్పత్రి పరిసర ప్రాంతాల యాచకులను తరలించనున్నట్లు తెలిపారు.

- Advertisement -