నాలాల సమస్యకు శాశ్వత పరిష్కారం: తలసాని

28
- Advertisement -

ఎన్‌ఎన్‌డీపీతో నాలాల సమగ్ర అభివృద్ధి చేపట్టామని….. హైదరాబాద్‌లో నాలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని స్పష్టం చేశారు మంత్రి తలసాని. సికింద్రాబాద్‌లోని పికెట్ నాలాపై రూ.10 కోట్లతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే సాయన్నతో కలిసి మంత్రి పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని….ఎన్నో ఏండ్ల నుంచి ఎలాంటి అభివృద్ధికి నోచుకోని నాలాలను మంత్రి కేటీఆర్ చొరవతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. దీంతో పరిసర ప్రాంతాల్లో వరదముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.

ఆసియాలొనే అతిపెద్ద స్లమ్‌గా పేరుగాంచిన రసూల్‌పురా బస్తీ కూడా ఈ నాలా పరిధిలోనే ఉందని వెల్లడించారు. వర్షాకాలం దృష్ట్యా పనులు వేగవంతం చేస్తున్నామన్నారు.

- Advertisement -