పాడి రైతులకు అండగా ప్రభుత్వం- మంత్రి తలసాని

176
minister talasani
- Advertisement -

పాడి రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ తెలిపారు. మంగళవారం విజయ డెయిరీ ఐస్ క్రీమ్స్‌ను ప్రారంభించింది..ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని ముఖ్య అతిథిగా హజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే విజయ డెయిరీ లాభాల బాటలోకి వచ్చింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా విజయ డెయిరీ రైతులకు 4 రూపాయల ప్రోత్సాహకం అందిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విజయ డెయిరీ నిర్లక్ష్యానికి గురైంది.

రాష్ట్రంలో 1000 విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయ కేంద్రాల ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్లుతుంది. దేశంలోనే నెంబర్ వన్ స్థానంలోకి విజయ డెయిరీని తీసుకెళ్తామన్నారు మంత్రి. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో విజయ తెలంగాణ ఉత్పత్తుల విక్రయాలను ప్రారంభించాం. రైతులు అందరూ విజయ డెయిరీకే పాలు పోయాలి. పాడి రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో అనేక కార్యక్రమాలు, సంస్కరణలు చేపట్టడం జరిగిందని మంత్రి వివరించారు. కాగా, ఐస్ క్రీమ్స్ ప్రారంభం సందర్భంగా మంత్రి విజయ డెయిరీకి 1000 రూపాయల ఇన్ సెంటివ్ ప్రకటించారు.

- Advertisement -