కందికొండ మృతి చాలా బాధాకరం: మంత్రి తలసాని

44
- Advertisement -

ప్రముఖ గీత రచయిత కందికొండ యాదగిరి మృతి చాలా బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం ఫిలిం ఛాంబర్‌లో కందికొండ పార్ధివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ సమాజానికి ఉపయోగ పడే పాటలు రాశారన్నారు. ఆరోగ్య రీత్యా చిన్న వయసులో ఇబ్బంది రావడం బాధాగా ఉందన్నారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా మంత్రి కేటీఆర్ అండగా ఉన్నారని, కందికొండ కుటుంబానికి ఇల్లు ఇస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు.

- Advertisement -