శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయండి: బీజేపీకి త‌ల‌సాని స‌వాల్

74
Minister Talasani
- Advertisement -

తెలంగాణ‌కు ఏం చేశారో శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్. అల్లూరి 125వ జ‌యంతి సంద‌ర్భంగా ట్యాంక్‌బండ్‌పై అల్లూరి విగ్ర‌హానికి నివాళి అర్పించారు.

అనంత‌రం మాట్లాడిన త‌ల‌సాని…దేశం నుంచి బీజేపీని తరమికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం చప్పగా సాగిందని…హైదరాబాద్‌ అందాలు చూసి మోడీ వెళ్లారని చెప్పారు.

బీజేపీ నేతలు అనవసరంగా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పలేకపోయారని మంత్రి తలసాని విమర్శించారు.

- Advertisement -