రాజగోపాల్ రెడ్డి వల్లే ఉప ఎన్నిక

88
- Advertisement -

మునుగోడు ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకెళ్తుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఓటరును ఆప్యాయంగా పలకరించి టీఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరుతున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోని పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ లోని పిండి పుల్లారెడ్డి గార్డెన్ లో హైదరాబాద్ లో ఉంటున్న మునుగోడ్ నియోజకవర్గ పరిధిలో గల నాంపల్లి కి చెందిన ఓటర్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గోన్నారు.

ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం ను ఆశీర్వదించండి. KCR నాయకత్వాన్ని బలపర్చాలని మంత్రి తలసాని శ్రీనివాస్ కోరారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల సమగ్ర అభివృద్ధి దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. మునుగోడ్ ఉప ఎన్నిక రాజగోపాల్ రెడ్డి స్వార్ధం వలన వచ్చిందని అన్నారు. 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు వచ్చిందని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. . నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని గెలిపించాలని మంత్రి కోరారు.

ఇవి కూడా చదవండి

లోకేశ్‌ కనగరాజ్‌ వెరీ బిజీ

నైట్రో స్టార్ సుధీర్ బాబు 18వ చిత్రం

‘వీరసింహారెడ్డి’ భారీ ఫైట్

- Advertisement -