శ్రీ‌వారి స‌న్నిధిలో మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్..

109
srinivas goud
- Advertisement -

తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్. ఇవాళ‌ల‌ ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన శ్రీ‌నివాస్ గౌడ్…తెలుగు రాష్ట్రాలు ప్రగతిపథంలో నడవాలని ఆకాంక్షించారు.

రాజకీయ అవసరాల కోసమే బీజేపీ హిందుత్వాన్ని వాడుకుంటున్నదని విమర్శించారు. దేశ ప్రజలకు భరోసా ఇవ్వలేని కాంగ్రెస్‌కు నాయకత్వం లేదన్నారు. సీఎం కేసీఆర్‌ దేశ రాజకీయాల్లో కీలక బూమిక పోషిస్తారని చెప్పారు. కేసీఆర్‌ నాయకత్వాన్ని యావత్‌ భారత్‌ కోరుకుంటున్నదని అన్నారు.

ఇక అంత‌క‌ముందు ఆలయానికి చేరుకున్నశ్రీనివాస్‌ గౌడ్‌కు వేద పండితులు ఆశీర్వాదం అందించగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.

- Advertisement -