- Advertisement -
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బాదం రామస్వామి ఆడిటోరియంలో తెలంగాణ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్.. మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్ రిక్రూట్ మెంట్ ట్రైనింగ్ ద్వారా 3 ఎస్ఐ లు, 59 మంది కానిస్టేబుల్ లుగా పోలీస్ శాఖలో ఉద్యోగాలు పొందారు. వారిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిసి అభినందించారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఉద్యోగ కల్పనకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు కోసం కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతోంది. యువత వాటిని సద్వినియోగరుచుకోవలన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
- Advertisement -