కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్న మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌..

164
minister srinivas goud
- Advertisement -

తెలంగాణలో కోవిడ్‌ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. కాగా,ఈరోజు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కొవిడ్‌ టీకా వేయించుకున్నారు. ఉదయం ఆయన మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ దవాఖానలో వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకున్నారు. మంత్రితోపాటు ఆయన తల్లి శాంతమ్మ, సోదరుడు శ్రీకాంత్‌ గౌడ్‌ కూడా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నది.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు 17,83,208 మందికి కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేశారు. ఇందులో 14,99,801 మంది వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకోగా, 2,83,407 మంది రెండో డోసు తీసుకున్నారు.

- Advertisement -